telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

మూడో టెస్ట్ కు జట్టును ప్రకటించిన బీసీసీఐ…

భారత్-ఆసీస్ మధ్య రేపటి నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది.. ఇక, మ్యాచ్‌లో తలపడనున్న తుది జట్టును ప్రకటించింది బీసీసీఐ.. ఇందులో ప్రధానంగా రెండు మార్పులు చేసింది.. గాయ‌ప‌డిన ఉమేష్ యాద‌వ్ స్థానంలో ఈ మ్యాచ్‌తోనే పేస్‌బౌల‌ర్ న‌వ్‌దీప్ సైనీ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు.. ఇక, మ‌యాంక్ అగ‌ర్వాల్ స్థానంలో రోహిత్ శ‌ర్మ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి టీమిండియా ఇన్సింగ్స్‌ను ప్రారంభించనున్నాడు రోహిత్… సైనీతో క‌లిపితే ఈ సిరీస్‌లో టెస్ట్ అరంగేట్రం చేసిన భార‌త ఆట‌గాళ్ల సంఖ్య మూడుకి చేరింది. ఇంత‌కుముందు బాక్సింగ్ డే టెస్ట్‌లో మ‌హ్మద్ సిరాజ్‌, శుభ్‌మ‌న్ గిల్ కూడా టెస్టుల్లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. మరోవైపు.. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది.. ఆసీస్ టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైన ఈ యువ బౌలర్.. మూడో టెస్ట్‌తో అరంగేట్రం చేస్తాడని అంతా ఆశించినా.. చోటు దక్కలేదు. చూడాలి మరి ఈ టెస్టులో ఏం జరుగుతుంది అనేది.

భారత జట్టు : శుభ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ (వైస్ కెప్టెన్), పుజారా, ర‌హానే (కెప్టెన్‌), విహారి, రిష‌బ్ పంత్‌ (వికెట్ కీపర్‌), జ‌డేజా, బుమ్రా, సిరాజ్‌, సైనీ, అశ్విన్‌. 

Related posts