వివిధ అంశాలపై ఏపీ సీఎం జగన్ కు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసహనం వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు రాసిన లేఖలకు స్పందించడాన్ని జగన్ నేర్చుకోవాలని హితవు పలికారు.ఏపీ పట్ల ప్రధాని మోదీకి ఉన్న చిత్తశుద్ధిని తెలుసుకుని నాయకులతో పాటు, ప్రజలు కూడా బీజేపీకి ఆకర్షితులవుతున్నారని కన్నా చెప్పారు.
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరబోతున్నట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే, బీజేపీలో చేరాలనే ఆలోచనలో చాలా మంది టీడీపీ నేతలు ఉన్నారనే విషయం మాత్రం వాస్తవమని తెలిపారు. ఆషాఢ మాసం కావడంతో చేరికలకు బ్రేక్ పడిందని చెప్పారు. శ్రావణ మాసంలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులపై వైసీపీ దాడులు పెరిగిపోయాయని, పోలీసులు పట్టించుకోకపోతే ఆందోళనలు చేపడతామని కన్నా హెచ్చరించారు.