telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు నిరసనలు తెలుపుతున్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలు మాకు చాలా ముఖ్యమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ‘బోస్టన్ కమిటీ, శివరామన్ కమిటీ చేసిన ప్రతిపాదనల పట్ల నేను సానుకూలంగా ఉన్నాను. కమిటీల ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Related posts