telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూదు..

చంద్రబాబుకు మతి భ్రమించిందని..ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావ‌డం లేద‌ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

గురువారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి వాళ్లు దేవతానుగ్రహం వుండొద్దని కోరుకుంటున్నానని సజ్జల వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే చంద్రబాబు మళ్లీ రాకూదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్ర‌బాబు తనకు శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకుంటున్నట్టు చెప్పారు. అంటే ఇన్ని రోజులు చంద్రబాబుకు తెలివితేటలు లేవా..? అన్ని ప్రశ్నించారు. ఆయనకు మంచి ఆలోచనలు, మంచి మనసు ఉంటే దుర్గమ్మ తప్పకుండా కరుణిస్తుంది.

చంద్రబాబు ఒక ఉన్మాదిలా మారి బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సీఎంను నిందిస్తున్నారు.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని అన్నారు

పోలవరంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోంది. .పోలవరం ఆలస్యానికి చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలే కారణమని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలంటూ చంద్రబాబు వాగుతున్నారని.. గతి తప్పిన చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉండాలా? అని ఫైర్‌ అయ్యారు.

ఒంగోలు ఘటనపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారని ఆయన తెలిపారు. ఉన్మాదం, బరి తెగింపు, లెక్కలేని తనం ఏమైనా వున్నాయంటే అది చంద్రబాబేనన్నారు. కిందిస్థాయి అధికారి చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే తప్పు పడుతున్నారని ఆయన ఫైరయ్యారు.

అన్ని వర్గాలను అవహేళనగా మాట్లాడటం చూస్తే ఆయన రాజకీయాల్లో ఉండటం అవసరమా అనిపిస్తోంది. వాస్తవాలను దాచి ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. .. 

Related posts