దాసరి కిరణ్ ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.
సైబర్ చట్టాలు ఎప్పుడూ కాపు కాసి ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. గిట్టని వారిపై అనుచిత పోస్టులు తగవన్నారు. రెచ్చగొట్టే పోస్టులు పెడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డీఎస్పీ హెచ్చరించారు.
సోనియా తెలంగాణ ఇవ్వకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా?