telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది..ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: చంద్రబాబు

chandrababu

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. ప్రజలు వరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. గుంటూరు జీజీహెచ్‌లో మృతదేహాలు ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా రోగిని చెత్త తరలించే వాహనంలో తరలించడం దారుణమని ఆయన చెప్పారు.

ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనాను మొదటి నుంచీ ప్రభుత్వం తేలికగా తీసుకుందని విమర్శించారు. విపత్కర పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని తెలిపారు. కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts