telugu navyamedia
వార్తలు సామాజిక

ఈ నెల 21 నాటికి అదుపులోకి కరోనా: పరిశోధకులు

Corona

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ భారత్‌లో మే 21 నాటికి అదుపులోకి రావచ్చని ముంబై స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ ఓ అధ్యయనంలో తేల్చి చెప్పింది. లాజిస్టిక్‌ డిస్ట్రిబ్యూషన్ విధానంలో భారత్‌లో కరోనా లెక్కలను అంచనా వేసి ఈ ఫలితాలు వెల్లడించారు.

కరోనా వైరస్ మొదట విజృంభించి, గరిష్ఠ స్థాయికి చేరి, ఆ తర్వాత క్రమంగా తగ్గుతున్నట్లు వివిధ దేశాల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తే తెలిసిందని చెప్పారు.ఈ లెక్కల ఆధారంగా భారత్‌లో కరోనా‌ వ్యాప్తి రేటును బట్టి అధ్యయనం చేశామని వివరించారు. మే 21 నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 24,222కు చేరుతుంది. గుజరాత్‌లో 4,833 కేసులు ఉంటాయని వెల్లడించింది.

Related posts