కరోనాపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం తప్పదని జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయం చెప్పిందని తెలిపారు. ఫేస్ మాస్కులు జీవితంలో భాగమని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అన్నారని ఆయన చెప్పారు. వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని జగన్ ఆలోచిస్తుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్లో కూర్చుని విమర్శలు చేస్తున్నారని అన్నారు.
దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు ఏపీలో జరుగుతున్నాయని చెప్పారు. ఏపీలో కరోనా పరీక్షల కోసం ఇప్పటివరకు 9 ల్యాబ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేగాక, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఏపీలో అధికంగా పరీక్షలు చేయడం వల్లే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1,02,460 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించారు.
చంద్రబాబు విధానాల వల్లే ఆర్థిక ఇబ్బందులు: మంత్రి బొత్స