telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో విధుల నుంచి 33 మంది వాలంటీర్లు ​తొలగింపు

ఏపీలో వాలంటీర్లకు ముఖ్య కార్యక్రమాలు అందిస్తుంది. అందులో ఒక్కటి ఈ కరోనా సమయంలో ఫీవర్ సర్వే బాధ్యతలు అప్పగించింది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో 33 మంది వాలంటీర్లు శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. కోవిడ్ ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి ఉన్నట్లు నిర్లక్ష్యంగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు, చేసిన కారణంగా వాలంటీర్లను విధుల నుండి తీసేసారు. సర్వే పై నిర్లక్ష్యం వహించిన వారిపై పై విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు తూ. గో.జిల్లా జాయింట్ కలెక్టర్. కీర్తి చేకూరి. తొలగించిన వాలంటీర్లు కాకినాడ రూరల్ ,కాకినాడ అర్బన్ ,రాజమండ్రి అర్బన్ ,తుని, రాజోలు ,అమలాపురం ,మామిడికుదురు…ఇతర ప్రాంతాల వాలంటీర్లగా గుర్తించారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts