telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు తీరుతో ఏపీకి నష్టం వచ్చింది: సీపీఐ నారాయణ

Narayana cpi

చంద్రబాబు తీరుతో ఏపీకి నష్టం వచ్చిందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘రాజధానికి సంబంధించిన అంశాన్ని మా రాష్ట్ర పార్టీ సమావేశంలో చర్చిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం నేను మాట్లాడుతున్నాను. మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు ఒక దఫా ఒక చోట (నాగ్ పూర్) మరో దఫా మరో చోట జరుగుతున్నాయన్నారు.

గతంలో అమరావతిని చంద్రబాబు రాజధానిగా చేస్తానన్నారు. పని కన్నా ఆర్భాటం ఎక్కువ చేశారు. ప్రభుత్వమే భూమిని సమీకరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వచ్చే డబ్బులతో రాజధాని కట్టాలన్న ప్రతిపాదనతో గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది సరికాదు. రాంగ్ స్టెప్ వేశారు’ అని నారాయణ వ్యాఖ్యానించారు.

చంద్రబాబును దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో కక్షపూరిత వైఖరితో జగన్ చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు గతంలో తీసుకున్న చర్యలన్నింటికీ అడ్డంగా నిలబడాలని కక్షతో వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో కక్ష సరికాదు. చేసేది మంచా? చెడా? అన్న విషయాలను చూసుకోవాలి. జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని నారాయణ విమర్శించారు.

Related posts