telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

కాబూల్‌ లో పేలిన కారు బాంబు.. ఏడుగురు దుర్మరణం

bomb blasts in srikakulam district costs 7 lives

ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాంబు పేలుళ్ల ధాటికి అక్కడున్న కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts