telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ బిల్ దేశ భవిష్యత్ కు దిశా నిర్దేశం: మోదీ

modi first step on black money

పౌరసత్వ బిల్ దేశ భవిష్యత్ కు దిశా నిర్దేశంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేడు రాజ్యసభకు బిల్లు రానుండగా ఈ ఉదయం బీజేపీ నేతలతో సమావేశమైన మోదీ పలు సూచనలు చేశారు. దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలకు, పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలకూ తేడా లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.

ఈ బిల్ తో నష్టమని పాకిస్థాన్ చెబుతోందని గుర్తు చేస్తూ, పక్క దేశాల వ్యవహారాలపై వారికి అవసరం ఏంటని ప్రశ్నించారు. పాక్ నేతలు మాట్లాడుతున్నట్టుగానే, కొన్ని పార్టీలు కామెంట్లు చేస్తున్నాయని మోదీ అన్నారు. ఈ బిల్ ను ప్రవేశపెట్టాలన్నది తమ మేనిఫెస్టోలోనే ఉందని అన్నారు. ఇచ్చిన హామీని ఇప్పుడు అమలులోకి తీసుకుని వస్తున్నామని ఆయన అన్నారు. పౌరసత్వ బిల్ నేటి మధ్యాహ్నం తరువాత రాజ్యసభ ముందుకు రానుంది.

Related posts