మార్చి 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ క్రికెట్ ఫ్యాన్స్ను మరింతగా ఆకట్టుకుంటుందని నిర్వాహకులు అంటున్నారు. అంతేకాక ఈ కొత్త సీజన్లో సరికొత్త రూల్స్ను అమలు చేయనున్నారు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఐపీఎల్ క్రేజ్ను మరింత పెంచేందుకు పలు నిబంధనలను ఈ ఏడాది ఆచరణలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. టైమింగ్స్ విషయంలో ఎటువంటి మార్పులు లేవు గానీ.. ఈసారి డబుల్ డెకర్ మ్యాచ్స్ కేవలం ఐదు మాత్రమే ఉండనున్నాయి. అటు ఫైనల్ ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుందని వెల్లడించారు.
ఈ ఏడాది ఐపీఎల్లో కొత్తగా యాడ్ అవుతున్న అదనపు ఆకర్షణలు ఏంటంటే..ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా బీసీసీఐ ఆల్ స్టార్ గేమ్ను నిర్వహించనుంది. సరిగ్గా ఈ మ్యాచ్ టోర్నమెంట్ మొదలయ్యే మూడు రోజుల ముందు జరగనుంది. హంగులు, ఆర్భాటాలు లేకుండా ఈ మ్యాచ్ కేవలం ఛారిటీ కోసం నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్కు బీసీసీఐ నో బాల్స్కు సరికొత్త రూల్ను అమలు చేయనుంది. నో బాల్ పర్యవేక్షణ థర్డ్ అంపైర్దేనని ఐసీసీ ఒక రూల్ను ప్రవేశపెట్టింది. ఇక అదే రూల్ ఐపీఎల్ 2020లో కూడా అమలు కానుంది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్లో మలింగా నో బాల్ ఎంతటి దుమారానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అంతర్జాతీయ మ్యాచుల్లో మాదిరిగానే ఐపీఎల్లో కూడా ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ అందుబాటులోకి రానుంది. ఏ ఆటగాడైనా గాయపడితే.. అతని స్థానంలో సబ్స్టిట్యూట్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయవచ్చు. ఇక ఈ నిర్ణయం మొత్తం మ్యాచ్ రిఫరీ చేతుల్లో ఉంటుంది. ఐపీఎల్కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టడానికి నాలుగు టీమ్లతో ఉమెన్స్ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. గతేడాది కేవలం మూడు జట్టులు మాత్రమే ఉన్నాయి.. 2018లో అయితే సూపర్నోవాస్, ట్రయిల్బ్లాజెర్స్ టీమ్లు ఉండేవి. ఈ వార్తపై ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం దీన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. క్యాప్డ్ ప్లేయర్స్ లేదా ఇండియన్/ ఓవర్సీస్ ఆటగాళ్లకు లోన్ లేదా మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇవ్వాలని చూస్తున్నారట. ఏది ఏమైనా ఈ ఏడాది ఐపీఎల్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కు సరికొత్త ఫీల్ను కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.