telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కాపర్ డాం తోనే .. ప్రాజెక్ట్ పూర్తీ అంటూ.. మోసం : ఉండవల్లి

Ex MP Undavalli comments special status

ప్రాజెక్టులపై మరోసారి ఉండవల్లి తన గళం విప్పారు. కేవలం కాపర్ డాం పూర్తిచేసి, ప్రాజెక్ట్ మొత్తం పూర్తైపోయిందని చెపుతూ ఇప్పటివరకు మోసం చేశారని దుయ్యబట్టారు. 300 కోట్ల పట్టిసీమకు 1500 కోట్లు ఖర్చుపెట్టారని అన్నారు. కేవలం నీళ్లు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు ఎలా అవుతుంది? అలా చేయాలని మీకు ఎవరు సలహా ఇచ్చారు, ఏ నిపుణుల సలహాతో ఎత్తిపోతల పథకం కింద ఇంత ఖర్చు చేశారు.. అని ప్రశ్నిస్తున్నారు.

పోలవరం సరిగ్గా పూర్తిచేయకపోతే రాజమేండ్రి మొత్తం మునిగిపోతుంది అన్నారు ఉండవల్లి. పోలవరంపై నాకే బోలెడన్ని సందేహాలు ఉన్నాయని ఆయన అన్నారు. నా ప్రశ్నలకు దయచేసి సమాదానాలు చెప్పాలని అడిగారు. నిన్న చంద్రబాబు పోలవరం సమీక్షించి, పూర్తిచేయడానికి 2020 వరకు సమయం పడుతుందని చెప్పిన నేపథ్యంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

మోడీతో పడకపోతే పోనీయండి, పోలవరం గురించి మీకే కనీస బాధ్యత లేదని ఈ వాయిదాలను చూస్తుంటే తెలుస్తుందని, అసలు ఆ ప్రాజెక్ట్ పూర్తిచేసే ఆలోచన చంద్రబాబుకు లేదని ఉండవల్లి అన్నారు. కేవలం ప్రజల కోసమే ఏపీసీఎం ఇష్టానికి సమీక్షలు అంటూ, కంటితుడుపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

Related posts