telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ వ్యాఖ్యలపై సొంత పార్టీలోని క్రైస్తవుల ఆగ్రహం

pawan-kalyan

 జనసేన అధినేత పవన్ కల్యాణ్ మత మార్పిడి పై చేసిన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోని నేతలు మండిపడుతున్నారు. జనసేన నేత, ఏపీ క్రైస్తవుల సంఘం నాయకుడు అలివర్ రాయ్ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరతామని తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయన వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని అలివర్ రాయ్ తెలిపారు. పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరిగాయని పవన్ కల్యాణ్ అన్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు మత విద్వేషాలు చెలరేగేలా ఉన్నాయని విమర్శించారు. తన వ్యాఖ్యలను పవన్ వెంటనే వెనక్కి తీసుకుంటారని తాము భావించామని తెలిపారు. అయితే ఆయన నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని వివరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

Related posts