telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే వెయ్యి జరిమానా: బీఎంసీ

spit open places

ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆదేశాలు జారీ చేసింది.

తొలి రోజు ఏకంగా 107 మందిని గుర్తించి వారి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా వసూలు చేసింది. వైరస్ నివారణలో ప్రజలు సహకరించాలని బీఎంసీ కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా పరిశుభ్రత పాటించాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా తో పాటు, సెక్షన్ 189 కింద అరెస్ట్ చేస్తామని బీఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.

Related posts