telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జేపీ నడ్డాపై కేటీఆర్ చేసిన విమర్శలకు దత్తాత్రేయ లేఖ

BANDARU DATTATREYA

బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలంగాణ పర్యటన అనంతరం బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరింది. ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. టీర్ఎస్ పార్టీపై జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ఇరు పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మాజీమంత్రి దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జేపీ నడ్డాపై కేటీఆర్ చేసిన విమర్శలకు దత్తాత్రేయ బహిరంగ లేఖ రాశారు.

జేపీ నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమంటూ లేఖలో పేర్కొన్నారు. కేటీఆర్ లా నడ్డా కార్పొరేట్ సంస్థల పెంపుడు నేత కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్‌, ఫార్మాసిటీ కోసం 2016లో నడ్డాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాల పుట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలపడుతుంటే టీఆర్‌ఎస్‌ నేతల్లో అసహనం పెరిగిపోతోందని లేఖలో పేర్కొన్నారు. అయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ గొప్పదైతే పేదలకు వైద్యం ఎందుకు అందడం లేదు? అని నిలదీశారు.

Related posts