telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

ధోనీకి స్టేజ్ ఫియర్ ఉందా.. సాక్షి సాయం చేసిందా..

sakshi helping dhoni on facing stage

బాలీవుడ్‌ సింగర్‌ అర్మాన్‌ మాలిక్‌తో పాటు పాడుతూ ధోనీని వేదికపైకి ఆహ్వానించగా అతడు సిగ్గుపడుతూ పారిపోయాడు. అప్పుడు సతీమణి సాక్షి అతడిని పట్టుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమం ఏంటో, ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ పాట పాడుతూ మహీని వేదిక పైకి ఆహ్వానించాడు. మైక్‌ ఇచ్చి పాట పాడమంటాడో ఏమోనని అతడు వెంటనే అక్కడ్నుంచి తుర్రుమన్నాడు. అతడి సతీమణి సాక్షి అడ్డుకున్నా అందరి మధ్యలోకి వెళ్లాడు. ఆ తర్వాత సాక్షి బతిమాలడంతో ఆమెతో కలిసి పైకి ఎక్కాడు.

‘ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ చిత్రంలోని ‘కౌన్‌ తుజే’ పాటను అర్మాన్‌ పాడుతుండగా మహీ ముసిముసి నవ్వులు నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. రెండు నెలలు సైన్యంలో పనిచేసిన అతడు తిరిగి జట్టుకు అందుబాటులోకి రాలేదు. అతడి భవతవ్యంపై ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌ తర్వాత తన ఉద్దేశాలు బయటపెడతానని మహీ సూచన చేశాడు. అందులో ఫామ్‌ను బట్టే టీ20 ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు ఉంటుందని కోచ్‌ రవిశాస్త్రి సైతం అన్నాడు. ఈ మధ్యనే బీసీసీఐ అతడికి కాంట్రాక్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.

Related posts