telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఒక్క ఓటు కూడా పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలి: పవన్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పనన్ కల్యాణ్‌… ఇవాళ మధ్యాహ్నం నాదెండ్ల నివాసంలో పవన్ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జనసేన చీఫ్‌.. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాలి.. హైదరాబాద్‌ విశ్వనగరంగా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే సాధ్యమతుందని అభిప్రాయపడ్డారు.. అందుకోసం.. ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా జనసైనికులు బీజేపీకి సహకరించాలని పిలుపునిచ్చారు పవన్.. సమయం లేకపోవడం, కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్ల పొత్తు కుదరలేదని క్లారిటీ ఇచ్చిన పవన్.. ఏపీ, తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గ్రేటర్‌లోనే కాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందని ప్రకటించారు. గ్రేటర్‌లోనే కాదు.. భవిష్యత్ ఎన్నికల్లోనూ కలిసే ఉంటామన్న ఆయన.. ఈ విషయంలో జనసేన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.. కానీ, విశాల హృదయంతో కార్యకర్తలు సహకరించాలని కోరారు.. మోడీ నాయకత్వంలో అభివృద్ధి సాధ్యం.. హైదరాబాద్ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు.

Related posts