telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్..సరిహద్దులో అదనపు బలగాలు

Sringar Encounter 2 Terrarists Death 

జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని భారత్‌, అమెరికాకు పాకిస్థాన్‌ నిఘా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. అవంతిపురలో శక్తిమంతమైన ఐఈడీ బాంబులతో కూడిన వాహనాలతో ముష్కరులు పేలుళ్లకు పాల్పడవచ్చని పాక్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీచేసింది.

గత నెలలో కశ్మీర్‌లో ఆర్మీ నిర్వహించిన స్పెషల్‌ ఆపరేషన్‌లో ఉగ్రవాది జకీర్ మూసా హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా ఉగ్రదాడులు జరుగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.

Related posts