telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

chandrababu

తన భద్రతను కుదించారంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.కాగా ఈ వ్యవహారంలో జూలై 10న తొలి విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు భద్రతా బృందం నుంచి ఇద్దరు ప్రధాన అధికారులతో పాటు వారి ఆధ్వర్యంలో పనిచేసే మరో 15 మందిని తొలగించారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Related posts