telugu navyamedia
వార్తలు సామాజిక

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Bank Jobs

విద్యావంతులైన నిరుద్యోగులకు ఐబీపీఎస్ శుభవార్త చెప్పింది. బ్యాంకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 1167 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుండగా, ఈ నెల 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు వయస్సు 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తీ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లో 734, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌ లో 83, యుకో బ్యాంక్‌ లో 350 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్తులు దరఖాస్తులను సమర్పించేందుకు https://www.ibps.in/ క్లిక్ చేయండి.

Related posts