వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. తాజాగా షర్మిలపై ఎంపీ రఘరామకృష్ణరాజు కామెంట్ చేశారు. రాజన్న రాజ్యం కోసం వైఎస్ షర్మిల ఏపీలో పోరాడాలని ఆయన సూచించారు. తెలంగాణలో కంటే… ఏపీలో షర్మిల పోరాడితే మంచి ఫలితం ఉంటుందన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందుతులెవరో వైసీపీ ప్రభుత్వం తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ప్రతిపక్ష నాయకుడిగా సీబీఐ విచారణ చేసిన సీఎం జగన్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. సీఐడీ విచారణకు ఆదేశించినా పురోగతి శూన్యమని ఫైర్ అయ్యారు. శవానికి కుట్లు వేసిన ఘటన గతంలో జరగలేదని ఎంపీ రఘరామకృష్ణరాజు గుర్తు చేశారు.
previous post