జాతీయ జల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో ఘనంగా జరిగింది. నీటి సంరక్షణ, నిర్వహణ, వినియోగంలో ఆంధ్రప్రదేశ్ కు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, మీడియా సంస్థలను అవార్డులకు ఎంపిక చేశారు. ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడో బహుమతి లభించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఏపీ తరఫున మంత్రి దేవినేని ఉమ గడ్కరీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భూగర్భ జలాల పెంపుదలలో అనంతపురం జిల్లాకు ప్రథమ బహుమతి భూగర్భజలాల పెంపుదలలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి లభించింది. నీటి వినియోగంలో కాకతీయ వర్సిటీ జియాలజీ విభాగం తొలిస్థానంలో నిలిచింది.
previous post
రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారు: శివసేన