చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా వకీల్ సాబ్లో నటించిన హీరోయిన్ నివేదా థామస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. “నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ప్ క్వారంటైన్లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో వస్తాను. నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్ టీంకు కృతజ్ఙతలు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి.. క్షేమంగా ఉండాలి” అని నివేదా థామస్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. నివేదా థామస్కు కరోనా సోకడంతో వకీల్ సాబ్ టీంలో టెన్షన్ మొదలైంది. jకాగా.. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ రిలీజ్ కానుంది.
previous post