telugu navyamedia
ఆంధ్ర వార్తలు

శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి మృతి..

శ్రీకాకుళం జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. పాతపట్నం మండలకేంద్రంలోని  కిరణ్మయి జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష రాస్తూ విద్యార్ధి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మృతి చెందిన విద్యార్థి సారవకోట మండలం దాసుపురం గ్రామానికి చెందిన బోరాడ కార్తీక్ (16) పాతపట్నంలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ మహేంద్ర జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు.  

బుధవారం కెమిస్ట్రీ పరీక్ష రాస్తుండగా కార్తీక్‌కు అకస్మాత్తుగా తలనొప్పి, వాంతులు కావడంతో స్పృహ కోల్పోయాడు.  వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది..చికిత్సం కోసం దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే కార్తిక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.

దీంతో సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహాన్ని పట్టుకుని తల్లిదండ్రులు కుమారి,శ్యాంసుందర్ గుండెలవిసేలా వారు రోదిస్తున్న తీరు.. అక్కడ ఉండే వారితోనూ కంటతడి పెట్టిస్తోంది.

Related posts