telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ : బీసీసీఐ సంచలన ప్రకటన

జులైలో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. గతేడాది కరోనా వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. అయితే ఈ శ్రీలంక టూర్ కు వెళ్లనున్న టీం ఇండియా జట్టు కోచ్ గా మాజీ కెప్టెన్‌, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. 2014 తర్వాత ద్రవిడ్ టీం ఇండియా ప్రధాన జట్టుతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. 2014లో ఇండియా టీం ఇంగ్లండ్ తో పర్యటించినప్పుడు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వ్యవహరించాడు. ఇక తాజాగా శ్రీలంక టూర్ కు వెళ్లనున్న టీం ఇండియా జట్టు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

Related posts