telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యువ ఎంపీటీసీ రజిత .. ఆత్మాహుతి.. కుటుంబ గొడవలే ..

suicide attempt cc

ఇటీవల స్థానిక ఎన్నికలలో గెలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన యువ ఎంపీటీసీ అప్పుడే తనువు చాలించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మంలో విషాదం చోటు చేసుకుంది. చిన్న వయసులోనే ఎంపీటిసిగా ఉన్న రజిత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే…వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో గుమ్మడం గ్రామం ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో రజిత (20) గెలిచింది.

చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అందరి మన్ననలు పొందిన రజిత అంతలోనే తనువు చాలించింది. రజిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం రజిత తన తల్లితో గొడవపడ్డారని, దీంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగినట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రజితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రజిత ఈరోజు ఉదయం మృతి చెందారు.

Related posts