టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 126 మందికి టిక్కెట్లను కేటాయించారు. శనివారం అర్ధరాత్రి మలి జాబితాలో మరో 15 మంది అభ్యర్థుల పేర్లను అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. మడకశిరలో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకు టిక్కెట్టు నిరాకరించారు.ఆమె స్థానంలో ఈరన్నకు బాబు చోటు కల్పించారు. తాడిపత్రి నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డికి చోటు దక్కింది.రంపచోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేశ్వరీకే బాబు సీటు కేటాయించారు.
రెండవ జీబితా టీడీపీ అభ్యర్థులు వీరే:
1. పాలకొండ- నిమ్మల జయకృష్ణ
2. పిఠాపురం- ఎన్వీఎస్ఎన్ వర్మ
3. రంపచోడవరం- వంతల రాజేశ్వరి
4. ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
5. పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్
6. పామర్రు- ఉప్పులేటి కల్పన
7. సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం
8. నందికొట్కూరు- బండి జయరాజు
9. బనగానపల్లె- బిసి జనార్దన్రెడ్డి
10. రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్
12. తాడిపత్రి- జేసీ అస్మిత్రెడ్డి
13. మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్
15. చిత్తూరు- ఏఎస్ మనోహర్