telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత ఆర్మీపై వివాదాస్పద పోస్ట్‌.. కశ్మీరీ విద్యార్థిని పై సుప్రీకోర్టులో పిటిషన్

shehla rasheed

భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నేత, స్థానిక యువతి షెహ్లా రషీద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.నిత్యావసర వస్తువులు కూడా అందక ఇబ్బంది పడుతున్నారని ట్వీట్ చేశారు. ఆర్మీ అధికారులను ప్రజలను చిత్రహింసలను గురిచేస్తున్నారని ఆరోపించారు. దీనిపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది.

ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని, కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టంచేసింది. షెహ్లా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపింది. అయితే భారత ఆర్మీపై ఆమె చేసిన పోస్ట్‌ వివాదంగా మారడంతో ప్రముఖ న్యాయవాది అలోక్‌ శ్రీవాస్తవ సుప్రీకోర్టులో క్రిమినల్‌ కేసును నమోదు చేశారు. భారత ప్రభుత్వంపై, ఆర్మీపై నిరూపణలేని ఆరోపణలు చేశారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Related posts