telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుమల కొండపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్….

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా కొనసాగుతోంది. ప్రముఖుల హీరోల నుంచి రాజకీయవేత్తల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. దైవాంశ సంభూతమైన ప్రకృతిని కోసం ఆ దేవ దేవుని సన్నిధిలోనూ పరితపిస్తున్నాడు… అంతా శ్రీహరి మయం, ఈ జగమంతా హరితమయం.. అని ధ్యాన్నిస్తున్నాడు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. పదికాలాల పాటు పచ్చగా వుండాలని సల్లగా బతకాలని దీవించే ఏడుకొండల వాడు కలియుగ దైవం వెంకటేశ్వరుని సాన్నిధ్యంలో మొక్కకు జీవం పోసి ఈ విశ్వానికి దైవ చింతనతో పాటు ప్రకృతి చింతనను ప్రభోధిస్తున్నడు.. హరిత రుషి..ఎంపీ సంతోష్ కుమార్. లోకాలనేలే శ్రీహరి దర్శనానంతరం హరితాన్నే ఆ స్వామి వారికి కానుకగా సమర్పించుకున్నడు. పచ్చని మొక్కను నాటి తన మొక్కును తీర్చుకున్నడు.. ఎంపీ..సంతోష్ కుమార్ జోగినపల్లి. ఈ సందర్భంగా తిరుపతిలో తన సహచర మిత్రులు ఎమ్మెల్సీ నవీన్ రావు, పోచం పెల్లి శ్రీనివాస రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నమనేని శ్రీనివాస రావు లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts