telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీమకు నీళ్లివ్వాలన్నదే తమ డిమాండ్: కన్నా

Kanna laxminarayana

పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లివ్వాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాయలసీమ కరవు నివారణకు పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలు వాడుకునేందుకు వీలుగా కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతివ్వడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుబట్టడం తెలిసిందే.

జల వివాదం పై కన్నా స్పందిస్తూ సీమకు నీళ్లివ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేసి అయినా సీమకు నీళ్లివ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని శ్రీ చైతన్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని తమ పార్టీ నేతలతో కలిసి కన్నా ఇవాళ సందర్శించారు. అక్కడి సౌకర్యాలపై క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు.

a

Related posts