ఏపీ సిఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్యాక్షనిస్టు భావాలు కలిగిన వ్యక్తి అని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని… వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టి వేస్తుందన్నారు. తిరుపతి బై ఎలక్షన్లలో దొంగ ఓట్లు వేపించారని… గురజాల ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మైనింగ్ మాఫియాకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. వైకాపా నాయకులు తెలంగాణ నుండి అక్రమ మద్యం తెచ్చి మన రాష్ట్రంలో అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర సంపదను అభివృద్ధికోసం ఖర్చుచేయటం మానేసి వైకాపా నాయకులు తమ విలాసాలకోసం ఖర్ఛు చేస్తున్నారని పేర్కొన్నారు.