telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత పట్టాభికి బెయిల్‌..

టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పట్టాభికి బెయిల్ ఇచ్చింది. సెక్షన్‌ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని టీడీపీ అధికార ప్రతినిధి కె.పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టాభిపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రస్తుతం పట్టాభి.. రాజమహేంద్రవరం  సెంట్రల్‌ జైల్‌లో ఉన్నారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్‌ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించారు. పట్టాభికి బెయిల్ రావడంపై టీడీపీ త‌మ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related posts