సీపీ అంజనీకుమార్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఈనెల 23 ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు ఈనెల 23 ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించారు.