జనసేన పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న దాదాపు 300 ఖాతాలను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ట్విట్టర్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ఖాతాల సస్పెన్షన్ పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నిస్సహాయుల పక్షాన నిలబడడమే తప్పా అని ఆయన అడిగారు. వాటిని ఎందుకు నిలిపేశారో అర్థం కావడం లేదని అన్నారు.
గత కొద్దిరోజులుగా జనసైనికులు ట్విట్టర్లో సేవ్ నల్లమల ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఏపీ సీఎంగా జగన్ ఫెయిల్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు సస్పెండ్ కావడంతో ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పనే అయి ఉంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సేవ్ నల్లమల ఉద్యమం వల్ల ఖాతాలు సస్పెండ్ చేసే అవకాశం లేదని జనసైనికులు అంటున్నారు.