telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉంది: బొత్స

minister bosta in vijayawada meeting

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల మూసివేతపై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూశామని వివరణ ఇచ్చారు. క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందన్నారు. గత ప్రభుత్వం అనవసరమైన చోట అన్నా క్యాంటీన్లను నిర్మించిందన్నారు. వీటికోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగిందని ఆరోపించారు.

త్వరలోనే అన్నా క్యాంటీన్లను నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో అవసరమైతే మొబైల్ క్యాంటీన్లు నిర్మిస్తామని అన్నారు. విజయనగరం పట్టణం పరిధిలో పేదల కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను మంత్రి బొత్స పరిశీలించారు. తక్కువ ధరలకే నాణ్యమైన ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. కాంట్రాక్టర్లు ధరలు తగ్గించకపోతే.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

Related posts