టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం పై ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఎంత వేధించినా వెనక్కి తగ్గబోమని చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. వైఎస్ జగన్కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అన్ని అనుమతులు పరిశీలించాకే చంద్రబాబు భవనాన్ని అద్దెకు తీసుకున్నారని వెల్లడించారు 2007కు ముందే . ఆ భవనాన్నినిర్మించారన్న విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భవనంలో ఇతర నిర్మాణాలకు ఎన్వోసీ కూడా తీసుకున్నారని తెలిపారు. భవన యజమాని రూ.18 లక్షల పన్ను కూడా చెల్లించారన్నారు. గత ప్రభుత్వ పాలనపై ఎంక్వైరీ వేయడం దౌర్భాగ్యమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.