telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నాం..

కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్ధం చేసుకోవడం శుభ పరిణామని అని కొనియాడారు. రైతుల సంక్షేమానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, వాటి మీద దృష్టి పెడుతున్నామని ప్రధాని చెప్పడం అభినందనీయమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం త సంవత్సరం నవంబర్‌ 26వ తేదీన తీసుకువచ్చిన రైతు చట్టాలు వ్యతిరేకంగా ఉన్నయంటూ రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు దిగారు. అంతేకాకుండా చాలా మంది చనిపోయారు కూడా. ఈ నేపథ్యంలో నేడు ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను ర‌ద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.

Related posts