telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పొగాకు రైతులను ఆదుకోవాలి..బోర్డుకు చంద్రబాబు లేఖ

chandrababu

పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ మేరకు పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథబాబుకు లేఖ రాశారు. ఏపీలో  ఇప్పటికే 124 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయిందని, దీనిని అమ్ముకునే వెసులుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయ ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లో విక్రయించే అవకాశం రైతులకు ఉందని, కానీ పొగాకు రైతులకు ఆ అవకాశం లేకుండా పోయిందన్నారు. మార్చి తొలి వారంలోనే జరగాల్సిన తొలి దశ వేలం కరోనలాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిందని తెలిపారు. ఇది మరింత ఆలస్యమైతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. బోర్డు వెంటనే స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Related posts