తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరిన విద్యార్థులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలు సొంత రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు.
‘పొరుగు రాష్ట్రాలలో వున్న ఏపీ ప్రజలు ఏప్రిల్ 14 వరకు అక్కడే ఉండాలి. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారితో జగన్ గారు మాట్లాడారు. అక్కడ వారికి ఏ కొరత రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చి కేసీఆర్ గారు పెద్ద మనసును చాటుకున్నారు. బయటి నుంచి పౌరులు వస్తే నియంత్రణ చర్యలు గతి తప్పే ప్రమాదం ఉంది’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.