telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నన్ను వాడుకుంటున్నారు..బొత్స వ్యాఖ్యలపై బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్ ఫైర్

Sri Bharath tdp

రాజధాని అమరావతికి 120 కిలోమీటర్ల దూనన్ను రంలో గత ముఖ్యమంత్రి వియ్యంకుడికి స్థలాన్ని ధారాదత్తం చేశారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఘాటుగా స్పందించారు. మీడియాతో శ్రీభరత్ మాట్లాడుతూ రాజధాని అమరావతిపై బురద చల్లడానికి తనను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆరోపణలు చేస్తే ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం సరికాదని అన్నారు.

2007లో కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్ కోసం 498.39 ఎకరాలను తీసుకున్నామని తెలిపారు. బొత్స చూపించిన జీవో 2012 నాటిదని చెప్పారు. అప్పటికి తన వివాహం కూడా జరగలేదని, పెళ్లికి ముందు జరిగిన ఆ వ్యవహారాన్నిఅనంతరం జరిగిన పరిణామాలకు ముడిపెడుతున్నారని దుయ్యబట్టారు. తనను టార్గెట్ చేసి, వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని కోరారు.

Related posts