telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సంపద సృష్టి చేతకాక ప్రభుత్వ భూముల అమ్మకం: దేవినేని

uma devineni

ప్రభుత్వ భూముల విక్రయాలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. విశాఖ, గుంటూరు నగరాల్లోని 9 చోట్ల భూములను అమ్మడానికి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ)కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.

సంపద సృష్టి చేతకాక ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములని అమ్మేఅధికారం మీకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. విశాఖలో మీరు దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లు రావడం కోసం ప్రభుత్వ భూములను విక్రయిస్తారా అని నిలదీశారు. కోట్లు పెట్టి తెచ్చుకున్న మీ సలహాదారులు ఇచ్చే సలహాలు ఇచ్చే సలహాలు ఇవేనా? అని ప్రశించారు.

కరోనా సమయాల్లో కూడా మాఫియాలు రెచ్చిపోతున్నాయని అన్నారు. మట్టి, పేకాట, ఇసుక, లిక్కర్ మాఫియాలు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయని ఆరోపించారు. అధికార మదంతో సామాన్యులని బెదిరించి గుడివాడలో భూములు లాక్కొంటున్నారన్నారు. ప్రజలు ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.

Related posts