telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నపై ప్రభుత్వం కక్షసాధింపు: సోమిరెడ్డి

టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ నుంచి అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మూడు రోజులు ఆసుపత్రి బెడ్ పైనే విచారణకు అనుమతిచ్చిన కోర్టునూ ధిక్కరిస్తారా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని వైద్యులపై, పోలీసులపై ఒత్తిడి తేవడం దారుణమని అన్నారు.

శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇలా వ్యవహరిస్తారా? అరెస్ట్ రోజు 14 గంటల పాటు కారులో తిప్పడం నుంచీ అచ్చెన్న విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఏపీలో సామాన్యుల నుంచి సీనియర్ ప్రజాప్రతినిధుల వరకు అందరి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన దురదృష్టకరని అన్నారు.

Related posts