telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

హత్యలపై లోకేశ్ దుష్ప్రచారం..హోంమంత్రి సుచరిత ఫైర్

sucharith home minister

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయనీ టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. అమరావతిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని నారా లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ కలహాలతో మంగళగిరిలో ఓ హత్య జరిగితే దాన్ని కూడా వైసీపీకి అంతగాడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రస్తుతంటీడీపీ నేతలు ఉనికి కోసం పోరాడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలే వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక టీడీపీ శ్రేణులు ఇప్పటివరకూ 57 మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారని ఆరోపించారు. కరకట్ట అక్రమ నిర్మాణాలు తొలగిస్తుంటే టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

Related posts