ఐపీఎల్ 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో ఆ టీమ్ ఫ్రాంచైజీ.. కెప్టెన్ స్టీవ్ స్మిత్పై వేటు వేసి సంజూశాంసన్ను తమ నూతన సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సంజూశాంసన్ మాట్లాడుతూ.. విరాట్, రోహిత్, ధోనీ తనకు అభినందనలు తెలిపిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ‘కంగ్రాట్స్ శాంసన్.. కొత్త బాధ్యతతో ఐపీఎల్లో బరిలోకి దిగుతున్నావు.. ఆల్ ది బెస్ట్’అని ముగ్గురు సారథులు అభినందిస్తూ పర్సనల్గా మేసేజ్ చేశారని శాంసన్ తెలిపాడు. కొన్నేళ్లుగా ఆడుతున్న జట్టుకు సారథి కావడం గర్వంగా ఉందని సంజూ సంతోషం వ్యక్తం చేశాడు. ‘రాయల్స్ జట్టు నాణమైన ఆటగాళ్లతో పాటు అద్భుతమైన సపోర్ట్ స్టాఫ్ను కలిగి ఉంది. కొన్నేళ్లుగా ఈ జట్టుకు ఆడుతుండటంతో వారందరికి నేను బాగా తెలుసు. మేమంతా ఓ కుటుంబం. కాబట్టి నా చుట్టున్నవారితో నేను సౌకర్యంగా ఉండగలుగుతా’అని శాంసన్ చెప్పుకొచ్చాడు. 2013 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న సంజు శాంసన్.. ఆ జట్టుపై 2016-17లో నిషేధం పడటంతో.. ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.
previous post
కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు