telugu navyamedia
వార్తలు సామాజిక

తమిళనాడులో 27 మంది జర్నలిస్టులకు పాజిటివ్

Media Press

ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులో కూడా ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేస్తున్న జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది.

రిపోర్టర్లతో పాటు సబ్ ఎడిటర్లు సహా మొత్తం 27 మందికి పాజిటివ్ గా తేలింది. అదే సంస్థలో పని చేస్తున్న ఓ జర్నలిస్ట్ కు తొలుత కరోనా పాజిటివ్ రావడంతో అక్కడే పని చేస్తున్న మొత్తం 94 మందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related posts