*ఆత్మకూరులో ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం
*బరిలో వైసీపీ , బీజేపీ..
*ఈ నెల 23న పోలింగ్
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం .మొత్తం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ తరుపున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి ఉండగా, బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. గత సంప్రదాయం ప్రకారం టీడీపీ అభ్యర్థిని పోటీలో నిలపలేదు. విక్రమ్ రెడ్డిపై బీజేపీ, బీఎస్పీ సహా పలు పార్టీలు, స్వతంత్ర్య అభ్యర్థులు కలిపి మొత్తం 13 మంది పోటీలో ఉన్నారు.
ఈ నెల 23వ తేదీన ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఆంధ్ర ఇంజినీరింగ్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి హరేంద్రియ ప్రసాద్ ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక ఎన్నికల విధుల్లో 1300 మంది సిబ్బంది పాల్గొననున్నారు. 279 పోలింగ్ బూత్లను అధికారులను ఏర్పాటు చేయనున్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను అధికారులు గుర్తించారు. 123 స్టేషన్ల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు