telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ అలా చేయకపోతే లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యేవాడా?: కొడాలి నాని

kodali nani ycp

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కనుక కౌన్సిల్ ను తిరిగి ఏర్పాటు చేయకపోతే నారా లోకేశ్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ అవుతాడా? మంత్రి అయ్యేవాడా? అంటూ ఏపీ మంత్రి కొడాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఒకరకంగా చెప్పాలంటే నారా లోకేశ్ కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని చమత్కరించారు.

లోకేశ్ లాంటి వ్యక్తులు చట్ట సభల్లోకి ఎప్పుడు రావాలి? మంత్రులు ఎప్పుడు కావాలి? అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు తన కొడుకు లోకేశ్ ను ఏం చేయలేకపోయారని విమర్శించారు.నాడు ఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేశారని, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌన్సిల్ ను మళ్లీ తీసుకొచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో పనికిమాలిన వాళ్లందరినీ మండలిలో పెట్టేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related posts