telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి నుంచి పోలవరం వరకు 6 లక్షల కోట్ల అవినీతి

YSRCP Release Chandrababu Corruption Book

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అతని అనుచరులు అమరావతి నుంచి పోలవరం నిర్మాణం వరకు 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. అవినీతి కార్యకలాపాల కోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనపై ‘చంద్రబాబు ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ అనే పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, సీనియర్‌ నేతలు ఢిల్లీలో విడుదల చేశారు. చంద్రబాబు నిజ స్వరూపం చెప్పడానికే ఈ పుస్తకమని తెలిపారు.

ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డపై అప్పుల భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని కాగ్‌ స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. 600 హామీలిచ్చిన తెలుగుదేశం పార్టీ ఒక్కటీ కూడా అమలు చేయలేదని రాజ్యసభ్యుడు వేంరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు.

Related posts